సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన పీర్ల పండుగ ముగింపు కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీర్ల ముజావర్లు షేక్ సైదా, మొయిన్, సైదా ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హుజూర్నగర్ పీర్ల చావిడికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నామని తెలిపారు