Sunday, June 29, 2025

డ్రగ్స్ గురించి వెంటనే పోలీసులకు తెలియజేయడం పౌరులుగా మనందరి బాధ్యత

డ్రగ్స్ కొనుగోలు లేదా అమ్మకం గురించి ఎటువంటి సమాచారం తెలిసినా, వెంటనే పోలీసులకు తెలియజేయడం పౌరులుగా మనందరి బాధ్యత.
ఇది మన సమాజాన్ని, ముఖ్యంగా యువతను డ్రగ్స్ బారి నుండి కాపాడటానికి అత్యంత కీలకమైన చర్య. మీ సమాచారం చాలా మంది జీవితాలను ప్రభావితం చేయగలదు మరియు నేరాలను అరికట్టడంలో సహాయపడుతుంది.
దయచేసి ఎటువంటి సంకోచం లేకుండా, మీకు తెలిసిన సమాచారాన్ని దగ్గర్లోని పోలీసులకు లేదా 100 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయండి. మీ గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుంది.

జిమ్ లేకర్ అజేయ రికార్డు: ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 19 వికెట్లు!

జిమ్ లేకర్ అజేయ రికార్డు: ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 19 వికెట్లు!
క్రికెట్ చరిత్రలో, కొన్ని రికార్డులు అద్భుతమైన విజయాలుగా నిలిచిపోయాయి, వాటిని అధిగమించడం అసాధ్యమనిపిస్తుంది. అలాంటి రికార్డులలో ఒకటి ఇంగ్లాండ్ ఆఫ్-స్పిన్నర్ జిమ్ లేకర్ సృష్టించిన అసాధారణ ప్రదర్శన, 69 సంవత్సరాల క్రితం, అతను ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన 19 వికెట్లు పడగొట్టాడు.
ఈ అరుదైన ఘనత బౌలర్ యొక్క అసాధారణ నైపుణ్యానికి మాత్రమే కాకుండా, అతని అచంచలమైన సహనానికి మరియు వ్యూహాత్మక పరాక్రమానికి నిదర్శనం. టెస్ట్ క్రికెట్‌లో ఇది ఇప్పటికీ అసమానమైన మైలురాయి, ఈ రికార్డును ఏ బౌలర్ కూడా ఇప్పటివరకు అధిగమించలేకపోయాడు లేదా సమం చేయలేకపోయాడు. ఈ ప్రకటన సరిగ్గా ఈ రికార్డును "బద్దలు కొట్టడం కష్టం" మరియు క్రీడలో "అభేద్యమైన రికార్డు" అని హైలైట్ చేస్తుంది.

ఇష్టకామేశ్వరి ఫ్రీ దర్శనం.90రోజులు వరకు close చేస్తారు.

జులై 1st నుంచి ఇష్టకామేశ్వరి clouse అవుతుంది.
90రోజులు వరకు clouse చేస్తారు.

నరేంద్ర మోడీ *మన్ కి బాత్* కార్యక్రమాన్ని గోవిందపురం 223 పోలింగ్ బూతు

భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నటువంటి *మన్ కి బాత్* కార్యక్రమాన్ని గోవిందపురం 223 పోలింగ్ బూతులో పట్టణ కమిటీతో కలిసి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రివర్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరియు దేశంలో జరుగుతున్న చిన్నచిన్న విషయాలపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్న ప్రధానమంత్రి గారికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమ విశిష్టతను గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షుడు కొల్లోజు నాగేంద్ర చారి, కార్యదర్శి చుక్క హరీష్, గండూరి నరసింహారావు, పులి నరసింహారావు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

జూరాల,మంజీరా ప్రాజెక్టులపై బి.ఆర్.ఎస్ తప్పుడు ప్రచారం…

జోగులాంబా గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండిజూరాల,మంజీరా ప్రాజెక్టులపై బి.ఆర్.ఎస్ తప్పుడు ప్రచారం…
జూరాల డ్యామ్ కు ప్రత్యామ్నాయ బ్రిడ్జికి 100 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
జూరాలకు ఎటువంటి ప్రమాదం లేదు ఇది రైతుపక్ష పాత ప్రభుత్వం-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూరాల,మంజీరా ప్రాజెక్టుల పై బి.ఆర్.ఎస్ పార్టీ తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.ప్రాజెక్టుల స్థితిగతులపై ఆ పార్టీ ప్రతినిధులు దురుద్దేశపురకంగా ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు పర్సయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.పదేళ్ళ బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆయన మండిపడ్డారుశనివారం రోజున సహచర మంత్రి వాకాటి శ్రీహరి,ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి,శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,మేఘారెడ్డి, పర్ణితా రెడ్డి,విజయుడు లతో పాటు ఏ.ఐ.సి.సి కార్యదర్శి సంపత్ కుమార్,మాజీ జడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య,కలెక్టర్ సంతోష్ కుమార్,నీటిపారుదల శాఖాధికారులతో కలసి ఆయన జూరాల ప్రాజెక్టును సందర్శించారు.అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారుజూరాల రోప్ లు,స్ట్రోక్ గేట్ల గురుంచి వస్తున్న ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని ఆయన కొట్టి పడేశారు.సాంకేతిక నిపుణులు అసలు అక్కడే సమస్యే లేదంటూ స్పష్టంగా దృవికరిస్తున్నారన్నారని ఆయన చెప్పారు.బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను కప్పి పుచ్చుకోవడమే రైతులను తప్పుదారి పట్టించడంలో తల మునకలై ఉన్నారని ఆయన ఎద్దేవాచేశారు.పాత ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జూరాల,మంజీరా,ఎస్.ఆర్.ఎస్.పి,కల్వకుర్తి, భీమా వంటి ప్రాజెక్టులను పునరుద్ధరణకు శ్రీకారం చుట్టామన్నారు.వాటిలో పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చి వేగవంతంగా పూర్తి చేసేందుకు సంకల్పించినట్లు ఆయన వెల్లడించారు.గడిచిన పదేళ్ళ వ్యవధిలో ఏనాడు నాటి పాలకులు ఆపరేషన్&మెయింట్ నెన్స్ లేనే లేదన్నారు. పైగా పూడిక తీత పనులు చేపట్టక పోవడంతో జూరాల ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం 20 నుండి 25 శాతం మేర తగ్గిపోయిందన్నారు.కేవలం కమిషన్లకు కట్టుబడి కాళేశ్వరం ప్రాజెక్టు పెరోతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాత ప్రాజెక్టులను గాలికి వదిలిన చరిత బి.ఆర్.ఎస్ పాలకులకు దక్కిందని ఆయన దుయ్యబట్టారు.అంతెందుకు ఇదే జూరాల డ్యామ్ మీద భారీ నుండి అతి భారీ వాహనాలు ప్రయాణించడం ప్రమాదకరమని డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేసిన ఘనత బి.ఆర్.ఎస్ పాలకులదని ఆయన విమర్శించారు.అటువంటి డ్యామ్ కు భవిష్యత్ లో ఎటువంటి నష్టం వాటిల్లకూడదన్న కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మాణం కోసం ఇప్పటికిప్పుడు 100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం పెంచేందుకు గాను పూడిక తీత పనులకు నిర్ణయం తీసుకున్నామన్నారు.అదే విదంగా రేలంపాడు రిజర్వాయర్ లో 4 టి.యం.సి ల నీటి నిల్వ పనులు ప్రారంభించామన్నారు.మల్లమ్మకుంట పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.నెట్టెంపాడు ప్రాజెక్టును 90 శాతం పనులు పూర్తి అయినా మిగిలిన 10 శాతం పనులను గత ప్రభుత్వం పూర్తి చేయడంలో వైఫల్యం చెందిందన్నారు.నిర్మాణపు అంచనాలను పునరుద్ధరించి 2,753 కోట్లతో డిసెంబర్ మాసంతానికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు ముందుకు సాగుతున్నాయన్నారుమక్తల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల నుండి ఒకేసారి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన రోజులు ఉన్నాయని ప్రస్తుతం వదిలింది లక్ష క్యూసెక్కుల నీరు మాత్రమే నని స్పష్టం చేశారు.జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ముప్పు ఏమి లేదని తాము కట్టిన కాళేశ్వరం తాము అధికారంలో ఉండగానే కూలిపోవడంతో దిక్కు తోచని బి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడంతో పాటు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

*బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయం*

*బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయం* 
 *బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి* 
 *బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్* 
ఖమ్మం : మా సోదరులు ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలను కలుపుకొని గ్రామమే రాజకీయ యూనిట్ గా చేసి బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు . ఆదివారం ఖమ్మంలో మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో దాసు సురేష్ పాల్గొని మాట్లాడుతూ... గత 78 సంవత్సరాలుగా బీసీలకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 18 శాతానికి కుదించి బీసీలకు వ్యతిరేకంగా పయనించడం వల్లనే గద్దెదించడం జరిగిందన్నారు . బీసీలు కాంగ్రెస్తో ప్రయాణించడం వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నా.. ఆ సామాజిక న్యాయం తెలంగాణలో లేకపోవడం బాధాకరమన్నారు . బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానంచేసి నామినేటెడ్ పదవుల్లో మాత్రం సీఎం సామాజిక వర్గానికి వర్తింపజేయటం అన్యాయమన్నారు . స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు వస్తాయనుకుంటే దానిని తాత్సారం చేస్తున్నారన్నారు . ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వలేక పోయిందన్నారు . అసెంబ్లీలో పాసైన అయిన 42 శాతం బిసి రిజర్వేషన్ ఆమోద బిల్లును గవర్నర్ కు పంపారు కానీ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాలని ప్రశ్నించారు . 1992లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తో సంప్రదించి 92వ రాజ్యాంగ సవరణ చేసి 69శాతం రిజర్వేషన్లను పెంచి అమలు చేయించుకున్నారని గుర్తుచేశారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని బీసీ రేజర్వేషన్ల పెంపుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు . ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ నందు 4 నియోజకవర్గాలకు గాను కనీసం ఒక స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం ఒక్క స్థానము కూడా బీసీలకు దక్కక పోవడం బీసీలపై కొనసాగుతున్న తీవ్ర వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు . గ్రామస్థాయిలో బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం నల్లేరుపై నడకే నని సురేష్ తెలిపారు . జిల్లా బీసీ ముఖ్య నాయకుల సమక్షంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తద్వారా ప్రతి గ్రామాన్ని ఒక రాజకీయ యూనిట్ గా ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయి కమిటీలను మండల , నియోజకవర్గ , జిల్లా వ్యాప్తంగా బీసీ ఐక్య వేదికలు ఏర్పాటుచేసి రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పెళ్లూరి విజయ్ కుమార్ , ఉరుకొండ సైదులు , పీట్ల స్వర్ణ కుమార్ , నక్క అజయ్ , అయితగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం

జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారి అధ్యక్షతన భారత ట్రేడ్ యూనియన్

 రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మాజీ పార్లమెంట్ సభ్యులు బి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ నియోజకవర్గ కార్మిక సంఘాల అధ్యక్షుడు పచ్చి పాలు ఉపేందర్ పాల్గొనడం జరిగినది సమావేశం ముఖ్య ఉద్దేశం జూలై 9 నా దేశ వ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె గౌరవ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి గారు సూచనల మేరకు హుజూర్నగర్ నియోజకవర్గంలో బి ఆర్ టి యు అనుబంధ సంఘాలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి పత్రికా ముఖంగా నియోజవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ తెలియపరుస్తున్నాను

తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు

మనందరిని రక్షించే తల్లికి మర్యాద పూర్వకంగా వందనం సమర్పణ చేయ్యడమే బోనం అందరిని కలరా మశూచి సకల రోగాలనుండి రక్షించే తల్లికి నివేదన చేయ్యడమే బోనం
"బోనం అంటే భోజనం. 
అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం !"
అమ్మకు మాత్రం ఆకలిదప్పులుండవా! అందువల్ల ఆమెను కన్నకొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి బోనాల పండగ పేర ప్రతి ఆషాడంలో అమ్మతల్లికి జాతరలు జరుపుతుంటారు.
మరి ఆషాడ మాసమే ఎందుకంటే, వర్షాలు కురిసి వ్యాధులు విజృంబిస్తాయి. మరోవైపు గ్రామీణులు వ్యవసాయం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, తమ పిల్లా పాపా గొడ్డు గోదా, పాడి పంటా, చల్లగా కాపాడుతల్లీ అంటూ మొక్కులు తీర్చుకుంటారు.
 అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం (భోనం) అత్యంత భక్తి శ్రద్ధలతో, ఊరేగింపుగా ఉరుమ్మడిగా కలిసి వెళ్ళి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పిస్తారు.
ఆషాడమాసం వర్షాలు విరివిగా కురవడం మూలాన క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపించి జన నష్టం కలగజేస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం కాని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. ప్రకృతి బీభత్సాన్ని జయించి వాటిని నివారించుకునే నిమిత్తం భక్తిభావంతో గ్రామదేవతలను ప్రతిష్టించుకొని విశ్వాసంతో ఆరాధించడం మొదలు పెట్టారు. దీనినే శక్తి ఆరాధన, ప్రకృతి ఆరాధన, 
గ్రామ దేవతల ఆరాధన అంటారు.
బోనాల ఉత్సవాల్లో కేవలం సంప్రదాయమే కాకుండా భక్తి, విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉన్నాయి. ఆషాడమాసంలో ఎక్కువగా కురిసే వర్షాల వల్ల వచ్చే అంటు రోగాల నివారణకై క్రిమి కీటకాలను, వైరస్ లను నశింపజేసే వేపాకు, పసుపు, నిమ్మకాయలు, కుంకుమ, గుగ్గిలం, సాంబ్రాణి, అగరువత్తులు, కర్పూరం, కొబ్బరి కాయలు మొదలగు పదార్థాలను తమ పూజా విధానంలో వాడుతారు. అందరిని సదా కాపాడుతల్లి అని వేడుకుందాం.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త