Thursday, July 3, 2025

AICC అధ్యక్షుల బహిరంగ సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు

హైదరాబాద్, జూలై 4, 2025: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు, ఈరోజు హుజూర్‌నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి. అజీజ్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సన్న బియ్యం పథకం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రైతన్నలకు రైతు భరోసా పథకం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు.
"జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్" కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఈ సభ గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సమ్మెట సుబ్బరాజు, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి బొడ్డు గోవిందరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు చిన్నం శ్రీనివాస్, మూడో వార్డు ఇంచార్జ్ గంజి శివ, ఎన్.ఎస్.ఇవై పట్టణ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా, సోషల్ మీడియా మోహన్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి మరియు పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.

సామాన్య కార్యకర్తకు పట్టం కట్టిన భారతీయ జనతా పార్టీ*

సామాన్య కార్యకర్తకు పట్టం కట్టిన భారతీయ జనతా పార్టీ* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ *నారపరాజు రామచందర్* గారిని ఏకగ్రీవంగా ఎన్నుకునందున హర్షం వ్యక్తం చేసి, వారికి శుభాభినందనలు తెలిపిన హుజూర్ నగర్ పట్టణ శాఖ. ఈ సందర్భంగా పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో *బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* మాట్లాడుతూ మన సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం గ్రామానికి చెందినటువంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అని, ఈ పార్టీలో పని చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం కల్పించేటువంటి పార్టీ అని, ఇది ప్రజల పార్టీ అని మరొక్కసారి రుజువయిందని తెలిపారు. ఈ పార్టీలో సుమారుగా 45 సంవత్సరాలుగా సామాన్య కార్యకర్తగా పని చేసుకుంటూ వస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి, మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడి, ఎన్నోసార్లు అరెస్టయి, లాఠీ దెబ్బలు తిన్నటువంటి కార్యకర్తకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం కల్పించడం ఒక శుభ పరిణామం అని తెలిపారు. అదే విధంగా *రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ నారపరాజ రామచంద్ర రావు* గారి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పోరాడి వారి నాయకత్వంలో రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతలపూడి ఉమామహేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు నాగేంద్ర చారి, పట్టణ కార్యదర్శి చుక్క హరీష్ మండల నాయకులు బలవంత్ సింగ్, బైరు సతీష్ మరియు పోలింగ్ బూత్ అధ్యక్షులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త