Tuesday, September 16, 2025

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంఆర్‌పిఎస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంఆర్‌పిఎస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్: భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తరపున ఎంఆర్‌పిఎస్ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా, ఎంఆర్‌పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని ప్రశంసించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఇట్లు,
ఏపూరి సత్యరాజు మాదిగ
జిల్లా అధికార ప్రతినిధి
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో సూపర్‌డెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్. శ్రీనివాస్ రాజుకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 25,000 జరిమానా

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో సూపర్‌డెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్. శ్రీనివాస్ రాజుకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 25,000 జరిమానా విధించబడింది. ఈ కేసు 2011లో నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలంలో ఏసీబీ దాడులలో నమోదైనది. హైదరాబాద్‌లోని 1వ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి (SPE & ACB) ఈ తీర్పును ప్రకటించారు.
కేసు పూర్తి వివరాలు
నిందితుడు: శ్రీనివాస్ రాజు, అప్పట్లో తిరుమలగిరి మండల తహశీల్దార్.
కేసు సంఖ్య: Cr. నం. 20/ACB-HR/2011 (CC నం. 32/2014)
నేరం: 30-12-2011న, శ్రీనివాస్ రాజు ఒక ఫిర్యాదుదారు నుండి రూ. 1,00,000 లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్, పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయడానికి ఈ లంచం తీసుకున్నారు.
శిక్ష: 1988 చట్టం ప్రకారం, ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 25,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో, మరో ఒక నెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
           ::::::::ప్రజా విజ్ఞప్తి::::::
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ప్రెస్ నోట్ కోరింది. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X/ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకే: సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ మాదిగ దీనస్థితి

 


ప్రభుత్వ పథకాలు అర్హులకే: సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ మాదిగ దీనస్థితి

హుజూర్‌నగర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదనడానికి నిదర్శనంగా, సామాజిక ఉద్యమకారుడు, దివ్యాంగుడైన బరిగెల చంద్రశేఖర్ మాదిగ దీనస్థితి నిలుస్తోంది. 90 ఏళ్ల వృద్ధురాలైన ఆయన తల్లి, పనిచేయలేని స్థితిలో ఉన్న కొడుకు సేవలోనే తన జీవితాన్ని గడుపుతున్నారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి, మాదిగల సంక్షేమానికి చంద్రశేఖర్ మాదిగ అనేక ఉద్యమాలు చేశారు. 1994 నుంచి రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం చురుగ్గా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ, నడవలేని స్థితిలో టౌన్ హాల్ పక్కన ఉన్న చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు.

పదేళ్లుగా ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న వీరి కళ్లలో కన్నీళ్లే మిగిలాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, చంద్రశేఖర్ మాదిగకు ఇందిరమ్మ ఇల్లు, వికలాంగుల సర్టిఫికెట్, పెన్షన్, మరియు జీవనోపాధికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇలాంటి నిజమైన లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, సంక్షేమ పథకాలు "అందని ద్రాక్ష"గానే మిగిలిపోతాయని స్పష్టమవుతోంది.

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

 


ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

హుజూర్నగర్: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం హుజూర్నగర్‌లో హుజూర్నగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.

మండల విద్యాధికారి ప్రసంగం

ఈ సందర్భంగా మండల విద్యాధికారి భూక్య నాయక్ మాట్లాడుతూ: రేపటి భావి భవిష్యత్తు తరానికి ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది. ఈ డిజిటలైజేషన్ యుగంలో విద్యార్థులను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అని తెలియజేశారు.

సన్మాన కార్యక్రమం

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన ఉపాధ్యాయులను శాలువా, మెమెంటో, పూలదండలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, అధికారులు: మండల పరిషత్ అభివృద్ధి అధికారి లావణ్య, మఠంపల్లి మండల విద్యాధికారి వెంకటాచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు: బీరెల్లి శ్రీనివాసరెడ్డి, పెనుగొండ శ్రీనివాస్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు: నలబోలు శ్రీనివాస్ రెడ్డి, దాడి నర్సిరెడ్డి, జహర్ అలం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు: అంకతి అప్పయ్య, వేముల శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, అత్తి వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త