Friday, November 7, 2025

డిప్యూటీ & డి.ఎం.హెచ్.ఓ గా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం - లింగగిరి వైద్యాధికారికి ఇన్చార్జి బాధ్యతలు

సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ జారీ చేసిన శుక్రవారం నాటి ఉత్తర్వుల మేరకు, హుజూర్నగర్ మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ను ఇన్చార్జి డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ (Dy .DM&Ho) గా నియమించడం జరిగింది. గతంలో ఈ పదవిలో పనిచేసిన డాక్టర్ జయ మనోరి పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన స్థానంలో డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త