Thursday, July 10, 2025

గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువులకు చిరు సత్కారం

ఈరోజు *భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* ఆధ్వర్యంలో *విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పుల వీరారెడ్డి* సమక్షంలో గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయులు మరియు ఎంతోమందికి విద్యను నేర్పి వారి ఎదుగుదలకు కారణమయినటువంటి *పులిపాటి నరసయ్య, ఎం.బి. దేవదానం, ఎం.డి మొయినుద్దీన్, పి. మోహన్, కె.వి.ఎన్. మూర్తి మరియు బి. రామలక్ష్మమ్మ* గార్లను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువు యొక్క గొప్పతనాన్ని వారి ఔనత్యాన్ని మరియు ఈ సమాజానికి గురువు యొక్క అవసరం ఎంత ఉన్నదో తెలియజేయడం జరిగింది. 
       అలాగే *బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* మాట్లాడుతూ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క గురువుకి పాదాభివందనాలు తెలుపుతూ ఈ దేశ భవిష్యత్తును నిర్మించేది గురువులే అని, ఈ భూమి మీద అత్యంత గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని కొనియాడారు. గురువును త్రిమూర్తులతో పోల్చినటువంటి గొప్ప సంస్కృతి మనదని, అలాగే ఈ గురుపరంపర ఈనాటిది కాదని వేదకాలం నాటి నుండి ఉందని, ఆ రోజుల్లో గురుకులాల వ్యవస్థ ఉండేదని, గురుకులంలో విద్యార్థులు గురువులకు సేవ చేస్తూ చతుః షష్టి కలలను నేర్చుకునే వారని తెలిపారు. నాటి త్రేతా యుగం నుంచి నేటి కలియుగం వరకు శ్రీరాముడు వశిష్ట మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు సాందీపని ముని దగ్గర అలాగే చత్రపతి శివాజీ మహారాజ్ సమర్థ గురు రామదాసు దగ్గర వారు వాళ్లను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందిన వారే అని తెలిపారు. ఈ సమాజానికి గొప్ప మార్గ నిర్దేశకులు గురువులని ఈ లోకంలో పెద్ద పెద్ద రాజులు, యుగ పురుషులు, మహానుభావులు అంతెందుకు దేవుళ్ళు సైతం ఏదో ఒక గురువు దగ్గర ఉపదేశం పొందిన వారే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు ఎం.ఎస్.ఎన్. రాజు, పి. చంద్రశేఖర్, అలవాల చంద్రయ్య, కె. లక్ష్మయ్య, టి. ప్రభాకర్ రెడ్డి, పి.ఎల్.ఎన్. రెడ్డి గార్లతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతలపూడి ఉమామహేశ్వర్, జిల్లా నాయకులు దేనుమకొండ రామరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షుడు కొల్లోజు నాగేంద్ర చారి, కంటు నాగరాజు, చుక్క హరీష్, పులి నరసింహారావు, బలవంత్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

నిస్వార్థ సేవకుడి ప్రస్థానం

ఎందరో నాయకులున్నారు, కానీ కొందరు మాత్రమే తమ జీవితాన్ని జాతి సేవకే అంకితం చేస్తారు. అలాంటి అంకితభావానికి, నిస్వార్థ సేవకు నిదర్శనంగా ఒక నాయకుడి ప్రస్థానం మన ముందు నిలుస్తుంది.
ఆయన సుమారు పన్నెండున్నర సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ కాలంలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేశారు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత, ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పట్ల తన అంకితభావాన్ని చాటుతూ, తన ముఖ్యమంత్రి జీతాన్ని మొత్తంగా విరాళంగా ఇచ్చారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల కుమార్తెల చదువుకు అండగా నిలవడానికి ఈ నిధులను ఉపయోగించారు. ఇది ఆయనకు ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
తర్వాత, ఆయన దేశానికి ప్రధానమంత్రిగా దాదాపు పదకొండు సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో, ఆయన దేశాన్ని ముందుకు నడిపించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన తన కుటుంబ సభ్యులను ఎవరినీ రాజకీయ పదవులలోకి లేదా ప్రభుత్వ లాభాలలోకి తీసుకురాలేదు. ఇది ఆయన నిస్వార్థ వైఖరికి, బంధుప్రీతికి దూరంగా ఉండటానికి నిదర్శనం.
ఆయనపై ఉన్న అతిపెద్ద 'ఆరోపణ' ఆయన ఒక 'కట్టర్ దేశభక్తుడు' కావడమే అని ఆయనను అభిమానించేవారు చెబుతారు. ఇది ఆయన దేశం పట్ల చూపించే గాఢమైన ప్రేమను, నిబద్ధతను సూచిస్తుంది.
ఆయన ప్రస్థానం త్యాగానికి, అంకితభావానికి, ప్రజా సేవకు ప్రతీకగా నిలుస్తుంది. ఇలాంటి నాయకులు దేశానికి గర్వకారణం.

హుజూర్ నగర్ నివాసి కొమ్ము బాలరాజు అకాల మరణం మాల సామాజిక వర్గానికి తీరని లోటు.

మాల మహానాడు, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుపాటి బాబురావు మాల మహానాడు ముఖ్య నాయకులతో కలిసి దివంగత కొమ్ము బాలరాజు పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
"కొమ్ము బాలరాజు అకాల మరణం మాల సమాజానికి పూడ్చలేని నష్టాన్ని కలిగించింది" అని దగ్గుపాటి బాబురావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు కోల్లపూడి దయాకర్, మాల కుల పెద్దలు మామిడి ఇమ్మానియేల్, కుడితెటి ఇర్మియ, కోల్లపూడి ఏసురత్నం, కోల్లపూడి కళ్యాణ్ రావు, అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్, మామిడి వసంత్ కుమార్, మండల అధ్యక్షుడు కమల రాజా, కోల్లపూడి జాన్ వెస్లీ, కోల్లపూడి ప్రవీణ్, కోల్లపూడి ఇస్సాక్, దగ్గుపాటి పేతురు, కోల్లపూడి రాజశేఖర్ తదితరులు, మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త