అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో శనివారం మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్, ఎంపీడీఓ హుజూర్నగర్ పట్టణ చైర్మన్ దొంతగాని శ్రీను, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని, ప్రతి మహిళా తన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు.
ఘనంగా సన్మానం
కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను జడ్జి గారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం, అక్కడికి విచ్చేసిన మహిళలు మరియు మహిళా కౌన్సిలర్లు అందరూ కలిసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్ వారిని పూలమాలలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్, మరియు హుజూర్నగర్ పట్టణ చైర్మన్ దొంతగాని శీను, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మహిళా కౌన్సిలర్లు హుజూర్నగర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.