నియామక పత్రం అందజేసిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ పిల్లలు మర్రి వెంకటేశ్వర్లు
మీ టీవీ గూడచారి ... హుజూర్ నగర్ జూన్ 19
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ పిల్లలు మర్రి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు గా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ల మర్కాపురానికి చెందిన పిల్లుట్ల లింగయ్యను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కులాలను ఏకం చేసి వారిని రాజకీయంగా ఎదుగుదలకు ప్రోత్సహించి నియోజకవర్గం లోని ప్రతి గ్రామ గ్రామాన మండల స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో అన్ని ఎలక్షన్లలో పోటీ చేసేలా సిద్ధం చేయాలని ఎస్సి, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కిన కృషి చేయాలని పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని కోరారు అనంతరం పిల్లుట్ల లింగయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారి మల్లికార్జున్ మరియు పార్టీ నాయకులకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు పిల్లలు మర్రి వెంకటేశ్వర్లు కు కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment