హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, గరిడేపల్లి ఎస్సై నరేష్లతో కలిసి గరిడేపల్లి పీఎస్ పరిధిలో పట్టుబడిన గంజాయి కేసు వివరాలను వెల్లడించారు.
ఘటనా వివరాలు:
గరిడేపల్లి ఎస్సైకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, శుక్రవారం (జూలై 4, 2025) ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన బొల్లా బాలకృష్ణ అలియాస్ బాలు, హుజూర్నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్ అనే నలుగురు వ్యక్తులు గంజాయి క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు.
వీరిలో ముగ్గురు వ్యక్తులు రాయినిగూడెం గ్రామ శివారులోని కాల్వపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు టీఎస్ 15 ఎఫ్సి 9289 నంబర్ పల్సర్ మోటార్ సైకిల్పై వచ్చి, గంజాయి ప్యాకెట్లు పంచుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల గంజాయి, ఒక పల్సర్ మోటార్ సైకిల్, బాలకృష్ణ వద్ద నుండి ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడి అరెస్ట్:
వారికి గంజాయి అమ్మిన బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్ను పట్టుబడి చేసి విచారించగా, అతను సుమారు నెల రోజుల క్రితం సీలేరుకు వెళ్లి కార్తీక్ అనే వ్యక్తికి రూ. 8,000/- ఇచ్చి 4 కేజీల గంజాయి కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అందులో కొంత తాను సేవించి, మరికొంత అవసరమైన వారికి అమ్ముకున్నట్లు తెలిపాడు. జూన్ 29న (శనివారం), శ్రీకాంత్ రూ. 1,000/- విలువైన గంజాయిని బొల్లా బాలకృష్ణ, షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్లకు అమ్మాడు. శుక్రవారం (జూలై 4, 2025) కూడా ఈ ముగ్గురికి రూ. 3,000/- విలువైన గంజాయిని అమ్మినట్లు ఒప్పుకున్నాడు.
కేసు నమోదు, తదుపరి చర్యలు:
పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, గణపవరపు శ్రీకాంత్ నుండి ఒక సెల్ ఫోన్, 2 కేజీల 30 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదక ద్రవ్యాల చట్టాల (NDPS Act) ప్రకారం కేసు నమోదు చేసి, హుజూర్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment