హుజూర్నగర్, తెలంగాణ – ఈరోజు వాగ్దేవి హైస్కూల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఐన బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంప్రదాయ వేషధారణల్లో పాల్గొని, ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చారు. పాఠశాల కరస్పాండెంట్ జాల జ్యోతి బాబు, ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ, బోనాల సంబరాలు జరుపుకోవడం వల్ల పిల్లల్లో భక్తి భావం పెరిగి, మన సంస్కృతిని కాపాడుకోవాలనే స్ఫూర్తి కలుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులైన నాగలక్ష్మి, మౌనిక, స్వతంత్ర, కళ్యాణి, ఉపేంద్ర, గృహలక్ష్మి, సునీత, పుష్ప, ఇంద్రజ తదితరులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

No comments:
Post a Comment