Sunday, September 7, 2025

కాళోజీ సాహితీ పురస్కారం 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవికి ముఖ్యమంత్రి అభినందనలు

ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలియజేశారు.

​ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ శ్రీమతి నెల్లుట్ల రమాదేవిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించారు.

​ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 9, 2025న రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో అందజేయనున్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త