ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
హుజూర్నగర్: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం హుజూర్నగర్లో హుజూర్నగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.
మండల విద్యాధికారి ప్రసంగం
ఈ సందర్భంగా మండల విద్యాధికారి భూక్య నాయక్ మాట్లాడుతూ: రేపటి భావి భవిష్యత్తు తరానికి ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది. ఈ డిజిటలైజేషన్ యుగంలో విద్యార్థులను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అని తెలియజేశారు.
సన్మాన కార్యక్రమం
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన ఉపాధ్యాయులను శాలువా, మెమెంటో, పూలదండలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, అధికారులు: మండల పరిషత్ అభివృద్ధి అధికారి లావణ్య, మఠంపల్లి మండల విద్యాధికారి వెంకటాచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు: బీరెల్లి శ్రీనివాసరెడ్డి, పెనుగొండ శ్రీనివాస్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు: నలబోలు శ్రీనివాస్ రెడ్డి, దాడి నర్సిరెడ్డి, జహర్ అలం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు: అంకతి అప్పయ్య, వేముల శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, అత్తి వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment