దిల్లీ జూలో దాదాపు జీవితాంతం ఒంటరిగా గడిపిన 'శంకర్' మరణంపై జంతు సంరక్షణ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శంకర్ ఒక ఆఫ్రికన్ ఏనుగు. దీనికి పునరావాసం కల్పించాలని ఎంతోకాలంగా కార్యకర్తలు కోరుతున్నారు.
బుధవారం ఆహారం తీసుకోవడానికి నిరాకరించిన శంకర్ సాయంత్రానికల్లా కుప్పకూలింది.
దానిని కాపాడటానికి పశువైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పడిపోయిన తర్వాత 40 నిమిషాల్లోనే ఈ 29 ఏళ్ల మగ ఏనుగు చనిపోయిందని జూ అధికారులు చెప్పారు.
No comments:
Post a Comment