Saturday, September 20, 2025

శంకర్' మరణంపై జంతు సంరక్షణ కార్యకర్తలు సంతాపం

దిల్లీ జూలో దాదాపు జీవితాంతం ఒంటరిగా గడిపిన 'శంకర్' మరణంపై జంతు సంరక్షణ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ ఒక ఆఫ్రికన్ ఏనుగు. దీనికి పునరావాసం కల్పించాలని ఎంతోకాలంగా కార్యకర్తలు కోరుతున్నారు.

బుధవారం ఆహారం తీసుకోవడానికి నిరాకరించిన శంకర్ సాయంత్రానికల్లా కుప్పకూలింది.

దానిని కాపాడటానికి పశువైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పడిపోయిన తర్వాత 40 నిమిషాల్లోనే ఈ 29 ఏళ్ల మగ ఏనుగు చనిపోయిందని జూ అధికారులు చెప్పారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త