ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్వపు భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలను తెలియజేస్తూ దానిలో భాగంగా స్వతంత్ర భారత్ లో కశ్మీర్ విషయంలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గారు 'లియాకత్ అలీ-నెహ్రూ' అనే ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి అనే నిర్ణయానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు "ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా" అని పిలుపునిచ్చి వారు కాశ్మీర్ పర్యటనకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో అక్కడ వారిని అక్రమంగా నిర్బంధించి వారు చనిపోవడానికి ఆనాటి ప్రభుత్వం కారణమైందని వారు తెలిపారు. అలా ఈ దేశం కోసం ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దేనుమకొండ రామరాజు, జనిగల శ్రీను, టౌన్ కన్వీనర్ నాగేంద్ర చారి, టౌన్ ప్రధాన కార్యదర్శి గుండా గోపి మరియు బూత్ అధ్యక్షులతో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Monday, June 23, 2025
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్ను అందిస్తాం.
Subscribe to:
Post Comments (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
No comments:
Post a Comment