Saturday, June 28, 2025

పాములపర్తి వెంకట నరసింహారావు” జయంతి

తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగుజాతి తేజస్సు, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ దశ–దిశలను మార్చిన యుగపురుషుడు, బహుభాషా కోవిదుడు మన తెలుగు వారికి ఆదర్శదైవం — ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. తెలుగు రాష్ట్రం నుండి ప్రధాని పదవిని అధిష్ఠించిన ఏకైక తెలుగు వ్యక్తి.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ధైర్యంగా ముందుకు నడిపించి, సంస్కరణల బాటలో నిలిపిన మహనీయుడు. మెజారిటీ లేకున్నా, తన దార్శనికతతో ఐదేళ్లపాటు స్థిరంగా పాలన అందించి, దేశ ఆర్థిక విధానాల్లో మూల ప్రణాళికలు అమలు చేసిన గొప్ప మేధావి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి దిక్సూచి అయ్యాయి.

భారతరత్న “పాములపర్తి వెంకట నరసింహారావు” జయంతి సందర్భంగా ఈ మహనీయుడిని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరికి గౌరవకరమైన క్షణం. తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయుడుగా, చిరస్మరణీయుడిగా నిలిచే నరసింహారావు గారు దేశానికి ప్రేరణగా నిలిచారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

"కవితారసపుజల్లు,
ఖడ్గాల గలుగల్లు,
కరణాలకే చెల్లు,
ఓ కూనలమ్మా !!"

తెలుగుతేజం 
కీర్తి శేషులు
శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా
మనః పూర్వక నివాళి !!

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త