ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల కె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, జామాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నర్సారెడ్డి, శ్రీను, బాపురావు, శ్రీనివాస్ గౌడ్, ముత్యం, శ్యాంరెడ్డి, ధర్మన్న, రాజేశ్వర్, అశ్వత్థామ, ముత్యం, రమేష్, సాయేందర్, VDC కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment