కేసు పూర్తి వివరాలు
నిందితుడు: శ్రీనివాస్ రాజు, అప్పట్లో తిరుమలగిరి మండల తహశీల్దార్.
కేసు సంఖ్య: Cr. నం. 20/ACB-HR/2011 (CC నం. 32/2014)
నేరం: 30-12-2011న, శ్రీనివాస్ రాజు ఒక ఫిర్యాదుదారు నుండి రూ. 1,00,000 లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్, పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయడానికి ఈ లంచం తీసుకున్నారు.
శిక్ష: 1988 చట్టం ప్రకారం, ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 25,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో, మరో ఒక నెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
::::::::ప్రజా విజ్ఞప్తి::::::
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ప్రెస్ నోట్ కోరింది. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), X/ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment